ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెవెన్యూ సదస్సులతో రైతులకు, ప్రజలకు మేలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 01:46 PM

రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు మరియు ప్రజల భూ సమస్యల పరిష్కారానికి మేలు జరుగుతుందని దండేపల్లి తాహశీల్దార్ రోహిత్ మరియు డిప్యూటీ తాహశీల్దార్ మాధవి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో తాహశీల్దార్ రోహిత్, తాళ్లపేట గ్రామంలో డిప్యూటీ తాహశీల్దార్ మాధవి రెవెన్యూ సదస్సులలో పాల్గొని రైతుల నుండి భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు.
గత ఐదు రోజులుగా జరుగుతున్న ఈ సదస్సులలో రైతులు మరియు ప్రజల నుండి 120కి పైగా అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా భూ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసీని చేస్తున్నామని, రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తాహశీల్దార్ రోహిత్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa