ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది : నీలం మధు ముదిరాజ్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 07:24 PM

బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో నీలం మధు తన సొంత నిధులు 15 లక్షలు వెచ్చించి నిర్మించిన ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బహుజనులకు అందులో ముఖ్యంగా ముదిరాజ్ లకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి గౌరవిస్తున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ముదిరాజ్ లను కేవలం ఓటు బ్యాంకు గా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముదిరాజ్ లను పాలనలో భాగస్వాములను చేశారని తెలిపారు. అందుకు ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఉదాహరణ అని కొనియాడారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీ కులగణన ను బీసీలందరూ వినియోగించుకోవాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనులు రాజకీయంగా బలపడాలని సూచించారు. మనలో రాజకీయ చైతన్యం వస్తేనే మన బిడ్డలు రాజకీయంగా బలపడితేనే మన జాతులకు గుర్తింపు వస్తుందని స్పష్టం చేశారు. ముదిరాజ్ ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లానని త్వరలో ఆ సమస్యలు పరిష్కారం చేసుకుందామన్నారు.ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వీర్నల సత్యనారాయణ,ఆత్మ కమిటి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కుంచల ప్రభాకర్,మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ,మాజీ ఎంపీటీసీ మహేష్,నీరుడి కృష్ణ, నర్సింలు,అశోక్,అన్వర్ పటేల్,మహేష్, శ్రీనివాస్, జాకీ, మల్లేష్, నర్సింలు, కాంగ్రెస్ శ్రేణులు,సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa