హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఆగస్ట్ 5వ తేదీ ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు కనిపించడంతో, మధ్యాహ్నం తరువాత కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా కూకట్పల్లి, మియాపూర్, శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్, లక్కడికాపూల్, అమీర్పేట్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో వర్షం పడింది.వర్షం కారణంగా రహదారులపై నీటి నిల్వలు ఏర్పడటంతో ట్రాఫిక్ జామ్లు చోటు చేసుకున్నాయి. కార్యాలయాలు, స్కూళ్లు ముగిసే సమయానికి వర్షం పడటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో మున్సిపల్ అధికారులు మరియు అప్రమత్తంగా ఉన్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం, రానున్న 4–5 రోజులు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం నుండి రాత్రి దాకా మోస్తరు నుండి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో పడే అవకాశముందని వెల్లడించారు. గాలుల వేగం కూడా క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వాతావరణ శాఖ సూచిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రహదారుల పరిస్థితిని ముందుగా తెలుసుకొని ప్రయాణాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మలిన డ్రైనేజీ, రోడ్లపై నీటి నిల్వలు వంటి సమస్యలకు మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టనుంది.వర్షాల కారణంగా వాతావరణం చల్లగా మారినప్పటికీ, ప్రజల జీవన శైలిపై చిన్నపాటి ప్రభావం చూపింది. రానున్న రోజుల్లో వర్షపు తీవ్రత తగ్గే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa