జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ ఇటీవల కన్నుమూశారు. ఆయన స్మృతికి అర్పణగా నిర్వహించిన సంతాప సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జార్ఖండ్లోని రామ్ గఢ్ లో ఉన్న శిబూ సోరెన్ నివాసానికి చేరుకున్న రేవంత్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
శిబూ సోరెన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 4వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త దేశ వ్యాప్తంగా శోకాన్ని రేపింది. ఆదివాసీ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు తెలిపారు.
సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, శిబూ సోరెన్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. ఆయన ఆదివాసీ హక్కుల పరిరక్షణలో నిబద్ధతతో ముందుకు సాగిన గొప్ప నాయకుడని కొనియాడారు.
శిబూ సోరెన్ జ్ఞాపకార్థంగా హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక భవన్ను నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ భవన్ను తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిధులతో నిర్మించనుందని తెలిపారు. దీనిద్వారా ఆదివాసీ ప్రజలకు శిబూ సోరెన్ చేసిన సేవలు మరింత సమాజానికి తెలిసేలా చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa