తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలకు వేడి మొదలైంది. బొజ్జ గణపయ్య రాకతో ఊళ్లూ, నగరాలూ పండుగ వాతావరణంలో మునిగిపోయాయి. మండపాల ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతుండగా, విగ్రహాల తరలింపు కూడా జోరుగా సాగుతోంది. భక్తుల ఉత్సాహానికి తోడు సంబరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఈ ఉత్సవాల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వినాయక మండపాల ఏర్పాటుకు ముందు అనుమతులు తీసుకోవాలని, నిబంధనలు పాటించాలని వారు స్పష్టం చేశారు. పండుగ ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరించారు.
విగ్రహాల తరలింపు సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూసుకోవాలని, పబ్లిక్ ప్రాపర్టీకి ఎలాంటి హాని కలగకూడదని సూచించారు. మండపాల వద్ద డీజేలు, భారీ శబ్దాలు, ఆడియో వ్యవస్థల వినియోగాన్ని నియంత్రించాలని, రాత్రి 10 గంటల తరువాత లౌడ్ స్పీకర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.
నవరాత్రుల నిర్వహణ, గణేశ నిమజ్జన వేళ పోలీసుల సూచనలు పాటించాలని, ఎలాంటి అపశృతి కలగకుండా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఉత్సవాల ఆనందాన్ని భద్రతా పరిరక్షణతో కలిపి జరుపుకోవడం అందరి బాధ్యత అని పోలీసులు గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa