ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిలిం నగర్లో నగలతో ఉదయించిన వ్యాపారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 07:31 PM

ఫిలింనగర్ కు చెందిన బంగారం వ్యాపారి మాణిక్ చౌదరి, తన వద్ద కుదువ పెట్టిన నగలతో పాటు అదృశ్యమయ్యాడు. షాపు మూసి ఎక్కడికో వెళ్లిపోయాడని బాధితులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో నాలుగు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. బసవతారకనగర్ కు చెందిన వ్యక్తి నుంచి 5 తులల బంగారం, మరో పూజారి నుంచి రూ. 17 లక్షలు తీసుకుని, వాటిని తిరిగి ఇవ్వకుండా పరారైనట్లు పిర్యాదులు వచ్చాయి. చిట్టీల పేరుతో కూడా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa