గురువారం ట్రేడింగ్లో పసిడి, వెండి ధరలు సరికొత్త ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో పసిడికి డిమాండ్ అమాంతం పెరిగి ధరలు చుక్కలనంటాయి.వివరాల్లోకి వెళితే... దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం డిసెంబర్ ఫ్యూచర్స్ ధర ఏకంగా రూ. 1,200 మేర పెరిగి, 10 గ్రాములు రూ. 1,28,395 వద్ద సరికొత్త జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఎంసీఎక్స్ సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కేజీకి రూ. 1,900కు పైగా పెరిగి, రూ. 1,64,150 వద్ద కొత్త రికార్డు సృష్టించింది. ఉదయం ట్రేడింగ్లో 10 గ్రాముల బంగారం ధర 0.60 శాతం లాభంతో రూ. 1,27,960 వద్ద, కేజీ వెండి ధర 1 శాతం లాభంతో రూ. 1,63,812 వద్ద ట్రేడ్ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa