ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో ఏఐతో పరీక్షా పత్రాల మూల్యాంకనం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 03:35 PM

హైదరాబాద్ శివరాంపల్లిలోని ఒక హైస్కూల్లో దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో పరీక్షా పత్రాలను దిద్దే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 'గ్రేడ్ మీ ఏఐ' అనే సాఫ్ట్‌వేర్ ద్వారా 50 మంది విద్యార్థుల పరీక్ష పత్రాలను కేవలం రెండు నుంచి ఐదు నిమిషాల్లో దిద్ది మార్కులు వేయవచ్చు. ఇది తప్పులను గుర్తించి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో కూడా సూచిస్తుంది. అమెరికాకు చెందిన అర్వాంచ్ కంపెనీ ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఈ విధానం తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని సులభతరం చేస్తుందని హైస్కూల్ యాజమాన్యం పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa