మాజీ మంత్రి హరీష్ రావు శేరిలింగంపల్లిలోని ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానను సందర్శించి, కాంగ్రెస్ పాలనలో ఆరోగ్య వ్యవస్థ దుస్థితిపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 110 రకాల మందులు, 134 రకాల పరీక్షలు ఉచితంగా అందించేవారని, కానీ ఇప్పుడు సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేవని, రోగులు బయట మందులు కొనాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై కాకుండా వైన్ షాపుల టెండర్లపై దృష్టి పెట్టిందని మండిపడ్డారు. తక్షణమే జీతాలు విడుదల చేసి, మందులు, పరీక్షలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa