తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అందింది. కాటన్ కార్పొరేషన్ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలోని పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఖమ్మం జిల్లాలోని మద్దులపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 317 జిన్నింగ్ మిల్లులను సీసీఐ ఇప్పటికే నోటిఫై చేయగా కొనుగోళ్లు మరో నాలుగైదు రోజుల్లో ఊపందుకోనున్నాయి. రేపు ఖమ్మం జిల్లాలో మరికొన్ని కొనుగోలు కేంద్రాలు, ఈ నెల 24న నల్గొండ జిల్లాలో సీసీఐ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa