వ్యవసాయ రంగానికి మరింత సాంకేతిక సహకారాన్ని, నాణ్యమైన సేవలను అందించే లక్ష్యంతో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'మన గ్రోమోర్' వ్యాపార కేంద్రం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో ఈ నూతన కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.
రైతులకు సమగ్ర సేవలే లక్ష్యం..
వెల్గటూర్ ప్రాంత రైతులకు వ్యవసాయానికి అవసరమైన సమగ్ర పరిష్కారాలను ఒకేచోట అందించే ఉద్దేశంతో ఈ గ్రోమోర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అధికారి సాయి కిరణ్, స్థానిక మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్ , మాజీ ప్యాక్స్ ఛైర్మన్ పోనుగోటి రాం మోహన్ రావు వంటి ప్రముఖులు ప్రారంభించారు.
గ్రోమోర్ సంస్థ అధికారులు మాట్లాడుతూ.. తమ కేంద్రం ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు వంటి అన్ని రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వీటితో పాటు.. పంటలకు సంబంధించిన సాంకేతిక సలహాలు, నేల పరీక్ష సేవలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని వివరించారు.
ఈ మన గ్రోమోర్ కేంద్రం ద్వారా రైతులకు సరైన సమయంలో, సరైన ధరలకు ఉత్పత్తులు లభించడం వలన.. వారు తమ పంట దిగుబడిని, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గోళ్ల తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి తో పాటు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి కృషి చేయడంలో ఈ కేంద్రం ముఖ్య పాత్ర పోషిస్తుందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో రైతు రుణ మాఫీ కాని రైతులు చాలా మంది ఉన్నారు. పెండింగ్ లో ఉన్నవారిలో అర్హులను గుర్తించి త్వరలోనే వారికి కూడా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు. అతి త్వరలోనే వారి ఖాతాల్లలో రుణమాఫీ నిధులు జమ కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa