ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రన్ ఫర్ యూనిటీ 2K రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 10:51 AM

పటాన్చెరు : భారతదేశ మొదటి ఉప ప్రధాని, ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ లో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటుచేసిన  2 కి.మీ. రన్ ను శుక్రవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఐక్యతకు ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. స్వాతంత్ర్యానంతరం అనేక దేశీయ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి పటేల్ అని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa