TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండటంపై సీఈవో సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు నాన్ లోకల్స్పై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, మాక్ పోలింగ్లో ఈవీఎంలు మొరాయించడంతో 9 చోట్ల వాటిని మార్చామని తెలిపారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa