జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాల సరిహద్దుల నుంచి కిలోమీటరు పరిధిలో అన్ని మైనింగ్ కార్యకలాపాలను సుప్రీంకోర్టు నిషేధించింది. ఈ కార్యకలాపాలు అటవీ జీవులకు హానికరమని పేర్కొంది. జార్ఖండ్లోని సారంద వన్యప్రాణుల అభయారణ్యం, ససంగ్దాబురు కన్జర్వేషన్ రిజర్వ్కు సంబంధించిన కేసులో ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని, గిరిజనుల హక్కులను రక్షించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa