TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈరోజు రాత్రి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెలలో ఇవాలే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. శుక్రవారం ఉదయానికల్లా ఉష్ణోగ్రతలు HYDలోని పలు ప్రాంతాల్లో 10-11°Cకి, నార్త్, వెస్ట్ TGలో 7-10°Cకి తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa