ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై దాడులకు నేటికీ 17 ఏళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 05:14 PM

ముంబైపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడికి నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న లష్కరే తోయిబా ముష్కరులు సృష్టించిన మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు దేశం నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా 'నెవర్‌ఎవర్‌' (మళ్లీ ఎప్పటికీ జరగకూడదు) అనే థీమ్‌తో గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.సరిగ్గా 17 ఏళ్ల క్రితం సముద్ర మార్గం ద్వారా నగరంలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ టెర్మినస్, తాజ్, ఒబెరాయ్ హోటళ్లు, నారిమన్ హౌస్ వంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ నరమేధంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. భద్రతా బలగాలు 9 మంది ఉగ్రవాదులను హతమార్చగా, అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నాయి. అనంతరం కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశారు.ఈ బాధాకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు, ఎన్‌ఎస్‌జీ ఆధ్వర్యంలో గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద స్మారక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో మరణించిన వారి ఫొటోలతో ప్రత్యేక స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముంబైలోని 11 కళాశాలలు, 26 పాఠశాలల విద్యార్థులతో శాంతి, జాతీయ భద్రతపై ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. రాత్రి సమయంలో గేట్‌వే ఆఫ్ ఇండియాను త్రివర్ణ పతాక రంగులతో, 'నెవర్‌ఎవర్‌' అనే పదంతో ప్రకాశవంతం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa