ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో సరికొత్త రికార్డ్,,,, దూసుకెళ్తున్న తెలంగాణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 07:26 PM

తెలంగాణలో పంటల దిగుబడి పెంచేలా, రైతులకు లాభం చేకూర్చే విధానాలు అవలంభింస్తోంది ప్రభుత్వం. ఆ మేరకు ఫలితాలు కూడా సాధిస్తోంది. తాజాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది తెలంగాణ. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్‌ రాష్ట్రాన్ని దాటేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో వ్యవసాయం వాటా 6.7 శాతం పెరిగినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అంటే, రూ. 1,00,004 కోట్లుగా ఉన్న వ్యవసాయం వాటా. 1,06,708కు చేరిందని తెలుస్తోంది. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో.. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుల ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ ప్రోత్సాహకాలు తోడ్పాటు అందిస్తున్నాయి.


తెలంగాణలో అన్ని పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి


సంవత్సరం పంట విస్తీర్ణం దిగుబడి


2023-24 సీజన్‌లో 209.62 లక్షల ఎకరాలు 296.17 లక్షల మెట్రిక్ టన్నులు


2024-25 సీజన్‌లో


220.77 లక్షల ఎకరాలు


320.62 లక్షల మెట్రిక్ టన్నులు


తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి


2023-24 సీజన్‌లో


118.11 లక్ష్లల ఎకరాలు 260.88 లక్షల మెట్రిక్ టన్నులు


2024-25 సీజన్‌లో 127.03 లక్షల ఎకరాలు 284.16 లక్షల మెట్రిక్ టన్నులు


కాగా, పత్తి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా రెండేండ్లు ఒకే తీరుగా ఉన్నా.. గతేడాదితో పోలిస్తే 26.35 లక్షల టన్నుల నుంచి ఈ ఏడాది 3.89 లక్షల టన్నులు పెరిగి 30.24 లక్షల టన్నులకు చేరింది. కాగా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్లు వ్యవసాయంపై దృష్టి సారించింది. అందులో భాగంగా రుణమాఫీ కోసం రూ. 20,616 కోట్లు, విద్యుత్ సబ్సిసిడీల కింద రూ. 10,444 కోట్లతో పాటు రూ. 54280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసింది. ఫలితంగా దేశంలోనే వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


వరి, పత్తి పంటలు మాత్రమే కాకుండా ఆయిల్ పామ్ సాగును కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా రైతులకు అనేక రాయితీలు ఇస్తోంది. రాయితీపై ఒక్కో ఆయిల్ పామ్ మొక్కను రూ. 20 కే ఇస్తోంది. ఎకరాకు దాదాపు 57 మొక్కలు నాటుకోవచ్చు. అంతేకాకుండా మొక్కలకు నీరు అందించడానికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై కూడా ప్రభుత్వం భారీగా రాయితీలు అందిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన రైతులకు 100 శాతం రాయితీ ఇస్తున్నారు. ఇక బీసీ రైతులకు 90 శాతం, మిగిలిన రైతులు.. 80 శాతం రాయితీతో ఈ పరికరాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa