ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం మంగాపురం గ్రామపంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ధరావతు అశోక రాణి (రాధాకృష్ణ భార్య) విజయం దాదాపు ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గ్రామంలోని ప్రతి మూలనూ చుట్టేస్తూ కార్యకర్తలు భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.
మంగాపురం తండా ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థికి అపూర్వమైన మద్దతు లభిస్తోంది. గతంలో ఇక్కడ ఇతర పార్టీలు ఆధిపత్యం చెలాయించినా, ఈసారి ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని స్థానిక నాయకులు చెబుతున్నారు. మహిళలు, యువత నుంచి పెద్దల వరకు అందరూ అశోక రాణి విజయంపై నమ్మకంతో ఉన్నారు.
ఇంటింటా తిరుగుతూ కార్యకర్తలు “ఈసారి మంగాపురం సర్పంచ్ ఖచ్చితంగా మనవే” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహం చాటుతున్నారు. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం లేకుండా భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలు కంకణం కట్టారు. రోజూ సాయంత్రం భారీ సమావేశాలు, బైక్ ర్యాలీలతో గ్రామం మారుమోగుతోంది.
ఈ ఎన్నికల ఫలితం కేవలం మంగాపురం గ్రామపంచాయతీకి మాత్రమే కాకుండా, పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బలాన్ని మరోసారి నిరూపించే అవకాశంగా కార్యకర్తలు భావిస్తున్నారు. ధరావతు అశోక రాణి విజయంతో పార్టీకి కొత్త ఊపిరి లభిస్తుందని, రానున్న రోజుల్లో ఇది పెద్ద మలుపుగా నిలుస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa