ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గతాన్ని మరచి కేవలం రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాను

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 03, 2025, 02:05 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కాకముందు చాలామందిని గదిలో పడేసి కొట్టాలన్నంత కోపం ఉండేదని, కానీ ముఖ్యమంత్రి అయ్యాక అదంతా వృథా అనిపించిందని అన్నారు. ప్రస్తుతం అవన్నీ మరిచిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో నిన్న కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాజకీయాల్లో కాళ్లలో కట్టె పెట్టడం సహజమని, దాన్ని సమస్యగా చూడవద్దని కొత్త డీసీసీ అధ్యక్షులకు సూచించారు. స్వయంగా రాహుల్ గాంధీకే ఈ సమస్య ఉందని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంపైనే కుట్రలు చేస్తున్నారని గుర్తుచేశారు. కొత్త అధ్యక్షులు నామోషీ పడకుండా సీనియర్ నాయకుల ఇళ్లకు వెళ్లి సహకారం కోరాలని హితవు పలికారు. రకరకాల మనస్తత్వాలను కలుపుకొనిపోయేదే కాంగ్రెస్ పార్టీ అని, అందరినీ సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa