ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబ్బాక ఆలయంలో వైకుంఠ ఏకాదశి: వెండి కిరీటం సమర్పణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 03:21 PM

దుబ్బాక పట్టణంలోని బాలాజీ ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, బిఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ ఆలయ మూలవిరాట్ విశ్వక్ సేన (గణపతి) విగ్రహానికి 1 కేజీ 500 గ్రాముల వెండి కిరీటాన్ని సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ చార్యులు, ట్రస్ట్ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి చింతరాజు సమక్షంలో ఈ పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజలు చేసి, విశ్వక్ సేన విగ్రహానికి వెండి కిరీటాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, పరశురామ్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa