ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగ నోట్ల కేసులో ఏడుగురి అరెస్ట్, సూత్రధారి పరారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 25, 2025, 10:47 AM

నిజామాబాద్ జిల్లా వర్నిలో దొంగ నోట్ల వ్యవహారం బయటపడింది. ఈ నెల 18న ఒక రైతు క్రాప్ లోన్ చెల్లించేందుకు వచ్చినప్పుడు దొంగ నోట్లను గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లకు చెందిన రవికుమార్​రెడ్డి ప్రధాన సూత్రధారిగా తేలింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, మిగిలిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపినట్లు బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ తెలిపారు. నిందితుల వద్ద రూ.9.86 లక్షల దొంగ నోట్లు, ల్యాప్​టాప్, ప్రింటర్లు, కారు, సెల్​ఫోన్లు, ముద్రణ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa