రాష్ట్రంలో రబీ సీజన్కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికంగా యూరియా అమ్మకాలు జరిగాయని, 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఫెర్టిలైజర్ యాప్ విజయవంతమైందని చెప్పారు. కేవలం 9 రోజుల్లో 2,01,789 బస్తాల యూరియాను యాప్ ద్వారా రైతులు కొనుగోలు చేశారని, ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని మంత్రి వివరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa