ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులు ఆందోళన చెందవద్దు.. మంత్రి తుమ్మల సూచన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 12:12 PM

TG: రాష్ట్రంలో యూరియా సరఫరా యథావిధిగా కొనసాగుతోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాల్లో మొత్తం 47.68 లక్షల సంచుల యూరియా అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. రబీ సీజన్ కోసం కేంద్రం రాష్ట్రానికి 20.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని తెలిపారు. కాగా ఇప్పటివరకు 5.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 3.71LMTs రైతులు కొనుగోలు చేశారని, మరో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాల్లో నిల్వ ఉందని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa