ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ ఎన్నికల ముందు,,,,47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 08:11 PM

తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు వేవంతం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను.. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు సంబంధించిందిన జీవోను (GO నెం.87).. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి విడుదల చేశారు. ఒకే చోట సుదీర్ఘ కాలంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, తమ సొంత జిల్లాలో పనిచేస్తున్న వారు బదిలీ అయిన జాబితాలో ఉన్నారు. పరిపాలన కారణాలతో పాటు ప్రమోషన్ల వల్ల కూడా బదిలీ అయిన వారు ఈ లిస్ట్‌లో ఉన్నారు. కాగా, సీవీఎన్ రాజు ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా ట్రాన్స్‌ఫర్ అయ్యారు.


మరోవైపు, ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా జి.రాజు క్యాతనపల్లిని ప్రభుత్వం నియమించింది. ముసాబ్ అహ్మద్‌ను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్‌ బదిలీ చేసింది. బి శ్రీనివాస్‌ ఆలేరు నుంచి హుజూర్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌ బదిలీ అయ్యారు. డి జైత్రమ్ ప్రమోషన్ పొంది జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమోషన్ పొందిన బి శరత్ చంద్ర నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వెళ్లనున్నారు.


తాజాగా ట్రాన్స్‌ఫర్ అయిన అధికారులు వెంటనే తమను నియమించిన ప్రాంతాల్లో కొత్త బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో.. విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పింది.


కాగా, త్వరలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ (ఎస్ఈసీ) వివిధ జల్లాలో కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత జనవరి 24 లేదా జనవరి 17న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ( telangana municipal elections notification 2026) విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. ఇప్పటికే మేయర్, చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa