వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలులో చిచ్చురేపుతున్నాయి. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్నా.. పరాయి వ్యక్తుల మోజులో పడి దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణ కోల్పోయి హత్యలకు తెగబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో జరిగింది. తన మధ్య సంబంధానికి అడ్డొస్తోందని ఓ మహిళ.. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అంతేకాకుండా 5 నెలల చిన్నారికి కూడా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతెపల్లికి చెందిన నగేష్, మమతలు భార్యాభర్తలు. నగేశ్కు సుజాత అనే మహిళలతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం మమతకు తెలిసి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తమ మధ్య సంబంధానికి నగేశ్ భార్య అడ్డుగా ఉందని సుజాత భావించింది. దీంతో మమత అడ్డు తొలగించుకోవాలని నగేశ్, సుజాత పథకం వేశారు. ఈ క్రమంలోనే ప్లాన్ అమలు చేసేందుకు నిర్ణయించుకున్నారు.
కాగా, శనివారం (జనవరి 31) సుజాత ఉక్రోషంతో మమత ఇంటికి వచ్చింది. చిన్నారితో ఉన్న మమతపై దాడికి పాల్పడింది. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్.. తల్లీబిడ్డలపై పోసి నిప్పంటించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. మంటలతో శరీరం కాలిపోతుంటే కాపాడాలంటూ మమత కేకలు వేసింది. మంటలు 5 నెలల చిన్నారికి కూడా అంటుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. అయితే మమత కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో మమత అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రగాయాలైన చిన్నారిని ఆసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల కూడా ఇలాంటి దారుణ ఘటన జరిగింది. గుంటూరు జిల్లాలో ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపేసి.. రాత్రంతో ఒంటరిగా కూర్చుని పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది ఓ మహిళ. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు అనే ఉల్లిపాయల వ్యాపారి చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఆయనకు లక్ష్మీమాధురితో 2007లో వివాహంకాగా.. ఇద్దరు మగపిల్లలు జన్మించారు. ఆమె విజయవాడలో సినిమాహాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది. ఈ క్రమంలో సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో భార్తను ప్రియుడితో కలిసి చంపేసింది మాధురి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa