వంగూర్ మండలం రంగాపూర్ లోని వెంకటేశ్వరా స్వామి దేవాలయం ప్రారంభోత్సవం సందర్భంగా, శ్రీ ఇద్దమ్మ దేవి భజన బృందం భజన కార్యక్రమంలో పాల్గొంది. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు భజన బృందాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి సంస్కృతిక సంస్థ మిడ్జిల్ మండల ప్రధాన కార్యదర్శి కొప్పుల సైదులు మాట్లాడుతూ, యువత చదువుతో పాటు ఆటపాటలు, భజన కార్యక్రమాల్లో పాల్గొని, భజనలను తరువాతి తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa