ట్రెండింగ్
Epaper    English    தமிழ்

FBI చీఫ్ కూడా సేఫ్ కాదు – ఇరాన్ సైబర్ దాడి కలకలం

national |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2026, 09:03 PM

అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతూ యుద్ధ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఈ ప్రభావం గల్ప్ దేశాలపై కూడా పడింది. సౌదీ అరేబియా నుంచి బహ్రెయిన్ వరకు అనేక దేశాలు ఈ పరిస్థితులతో అప్రమత్తంగా మారాయి.ఆ దేశాల్లో ఉన్న అమెరికా ఎయిర్‌బేస్‌లు, రాయబార కార్యాలయాలు ఇరాన్ లక్ష్యంగా మారుతున్నాయి. మిస్సైళ్ల దాడులు, డ్రోన్ దాడులతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన హ్యాకర్లు అమెరికా Federal Bureau of Investigation (FBI) చీఫ్ Kash Patel‌కు పెద్ద షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఆయన వ్యక్తిగత ఈమెయిల్ అకౌంట్, ఇన్‌బాక్స్‌ను హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ సైబర్ దాడికి సంబంధించిన వివరాలను ఇరాన్‌కు చెందిన “హందాలా” హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. వారు కొన్ని ఈమెయిళ్లు, ఫొటోలు, అలాగే వ్యక్తిగత వివరాలతో కూడిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ విషయం Reuters నివేదిక ద్వారా బయటపడింది.ఈ దాడికి పూర్తి బాధ్యత తమదేనని హ్యాకర్స్ టీమ్ ప్రకటించింది. దీన్ని “అత్యంత కీలకమైన సైబర్ చొరబాటు”గా వారు అభివర్ణించారు. “కష్ పటేల్ ఇప్పుడు విజయవంతంగా హ్యాక్ అయిన వారి జాబితాలో చేరారు” అని వారు పేర్కొన్నారు.అయితే లీక్ అయిన ఈమెయిళ్లు, డాక్యుమెంట్ల నిజానిజాలపై Reuters వెంటనే పూర్తి ధృవీకరణ ఇవ్వలేకపోయింది. కానీ పరిశీలించిన నమూనా సమాచారంలో 2010 నుంచి 2019 మధ్య వ్యక్తిగత, వృత్తిపరమైన కమ్యూనికేషన్ ఉన్నట్లు తెలిపింది.ఈ ఘటనపై అమెరికా న్యాయ శాఖకు చెందిన ఒక అధికారి స్పందిస్తూ, కష్ పటేల్ ఈమెయిళ్లు లీక్ అయిన విషయం నిజమేనని ధృవీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సైబర్ దాడి పరిమాణం, దాని సున్నితత్వం గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.ఈ వ్యవహారంపై FBI నుంచి అధికారిక స్పందన ఇంకా రాలేదు. త్వరలో పూర్తి స్థాయి నివేదిక వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa