ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కప్పట్రాళ్లలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. హాజరైన ఈగల్ ఐజీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2026, 04:01 PM

దేవనకొండ మండలం కప్పట్రాళ్ళ గ్రామంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ దంపతులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. వేదమంత్రాల నడుమ జరిగిన పూజల్లో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పురోహితులు వెంకటరమణ, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa