Indian Premier League 2025 సీజన్లో Royal Challengers Bangalore టైటిల్ గెలుచుకోవడంలో వికెట్కీపర్ బ్యాటర్ Jitesh Sharma కీలక పాత్ర పోషించాడు. ఫినిషర్గా అద్భుతంగా రాణిస్తూ జట్టుకు కీలక స్కోర్లు అందించడంతో పాటు, వికెట్ల వెనుక కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. దీంతో IPL 2026 సీజన్లో కూడా అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక IPL 19వ ఎడిషన్కు ముందు జితేశ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్సీబీలో చేరకముందు అతడు Punjab Kings తరఫున మూడు సీజన్లు ఆడాడు. కానీ IPL 2026 మెగా వేలంలో ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. తొలుత రూ.7 కోట్లకు బిడ్ వేయగా, పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించింది. అయితే ఆర్సీబీ మొత్తాన్ని రూ.11 కోట్లకు పెంచడంతో పంజాబ్ వెనక్కి తగ్గింది.ఈ ఘటన తర్వాత పంజాబ్ కింగ్స్ సహ యజమాని Preity Zinta జితేశ్ శర్మకు సారీ చెప్పినట్లు అతడే వెల్లడించాడు.“ప్రీతి జింటా నాకు పెద్దక్కలా ఉంటారు. ఆమె తరచూ ఫోన్ చేసి, మెసేజ్లు చేస్తూ ఉండేవారు. నేను హిమాచల్ ప్రదేశ్కు చెందినవాడినని తెలిసిన తర్వాత మా మధ్య బంధం మరింత బలపడింది. ఆమె చాలా మంచి వ్యక్తి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టులోకి రావడం నా జీవితాన్ని మార్చింది. అప్పట్లో వేలంలో నాకు ఒకే ఒక్క బిడ్ వచ్చింది, అది కూడా పంజాబ్ నుంచే. నేను ఈ స్థాయికి రావడానికి ఆ జట్టే కారణం,” అని జితేశ్ తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa