Indian Premier League 19వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ‘19 YEAR LEGACY’ పేరుతో ఐపీఎల్ యాజమాన్యం MS Dhoni, Rohit Sharma, Virat Kohli, Manish Pandey ఫోటోలను షేర్ చేసింది.2008లో ప్రారంభమైన ఐపీఎల్ నుంచి ఇప్పటివరకు నిరంతరంగా ఆడుతున్న ప్లేయర్లు వీరు నలుగురే కావడం విశేషం. ఇంతకాలం పాటు కొనసాగుతూ అభిమానులను అలరించడం వీరి ప్రత్యేకతగా నిలిచింది.ఈ సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఒకే జట్టు తరఫున ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లీ కావడం మరో విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa