AP: రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిదారులకు శుభవార్త తెలిపింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై విధించిన వడ్డీలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ నెల 31తో ఈ రాయితీ గడువు ముగియనుంది. ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. గత 8 ఏళ్లుగా వడ్డీతో కలిపి రూ.6,072 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa