రోడ్డు ప్రమాదాలను నివారించడానికి హైదరాబాద్ నగర పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, సురక్షిత ఆచరణలను ప్రోత్సహించడం. ఈ కాన్సెప్ట్కి పేరు “హెల్మెట్ బ్యాంక్”.హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తూనే, ఉచితంగా కొత్త హెల్మెట్ను అందిస్తున్నారు. హెల్మెట్ తీసుకునే ముందు, వ్యక్తిగత ఫోన్ నంబర్, అడ్రస్ మరియు ఇతర వివరాలను పోలీసులకు అందించాల్సి ఉంటుంది. 24 గంటల్లో కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి పాత హెల్మెట్ను తిరిగి పోలీసులకు ఇవ్వకపోతే, వ్యక్తిగత వివరాల ఆధారంగా వారిని ట్రాక్ చేసి మరల జరిమానా విధించవచ్చు.ప్రస్తుతం మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హెల్మెట్ బ్యాంక్ కాన్సెప్ట్ ప్రారంభించబడింది. సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్ వద్ద ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు. విజయవంతమైతే, మిగిలిన పోలీస్ స్టేషన్లలో దశలవారీగా విస్తరించనున్నారు. ప్రధాన లక్ష్యం రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ వాడకంపై అవగాహన పెంపొందించడం.ప్రారంభ దినంలోనే పలువురు ద్విచక్రవాహనదారులకు బ్రాండెడ్ హెల్మెట్లను అందజేశారు. వారికి హెల్మెట్ బ్యాంక్ విధానం వివరించి, 24 గంటల్లో కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి పాత హెల్మెట్ తిరిగి ఇవ్వాలని సూచించారు. హెల్మెట్ లేకుండా నడిచిన రైడర్ మరియు వెనుక కూర్చున్న వారికీ మోటారు వాహన చట్టం ప్రకారం 200–500 రూపాయల జరిమానా విధించబడుతుంది. అత్యధికంగా ఈ జరిమానా 1,000 రూపాయల వరకు పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa