రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్షకు మొత్తం 5,14,598 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 4,98,695 (96.90%) మంది హాజరయ్యారు. 15,903 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా సాగాయని బుధవారం నాంపల్లిలోని బోర్డ్ కార్యాలయంలో సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa