హైదరాబాద్లోని సైదాబాద్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఎంఎన్ఆర్ గార్డెన్ సమీపంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో 'అరైవ్ అలైవ్' క్యాంపెయిన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రామ్దాసు తేజావత్ ముఖ్య అతిథిగా పాల్గొని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అవగాహన కల్పించారు. ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయకూడదని, ద్విచక్ర వాహనదారులు, పిలియన్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa