ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాద్ నగర్ ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 18, 2026, 12:33 PM

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, వారు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు చేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని, ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో పేద ముస్లింలకు ప్రభుత్వం తరపున తోఫాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa