తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి కీలక హెచ్చరికలు చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆదిలాబాద్, RR, సిద్దిపేట, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, MDK, మేడ్చల్, పెద్దపల్లి, సిరిసిల్ల, HNK, యాదాద్రి జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa