పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీ, నాగులమ్మ గడ్డ, రాఘవేంద్ర కాలనీ, బఖత్ గల్లీ, లక్కడోడి, నేతాజీ నగర్, మార్క్స్ నగర్, వెంకటేశ్వర కాలనీ, గోనెమ్మబస్తీలలో ఉన్న ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్ఎస్ నాయకులు , MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూ, పండుగల సందర్భంగా అవసరంలో ఉన్నవారికి సహాయం అందిస్తున్నామని తెలిపారు.దసరా, క్రిస్మస్, రంజాన్ వంటి పర్వదినాలను కులమతాలకు అతీతంగా జరుపుకుంటూ, సమాజంలో ఐక్యతను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.పండుగ అంటే కేవలం ఆనందం మాత్రమే కాదు – అవసరంలో ఉన్నవారితో ఆ ఆనందాన్ని పంచుకోవడం నిజమైన పండుగ అని ఆయన అన్నారు.ప్రజల కోసం, ప్రజల మధ్యలో కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమాలకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa