సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదంలో 36 మంది ప్రయాణికుల్లో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa