కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. గురువారం రోజు స్వామివారిని 60,699 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,096 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa