ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంఎంటీఎస్ అత్యాచార ఘటన కేసు,,,నిందితుడిని గుర్తించిన పోలీసులు

Crime |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 08:16 PM

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి ఈనెల 23న సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లేందుకు ఎంఎంటీఎస్ ట్రైన్‌లోకి ఎక్కగా.. ఒంటరిగా ఉన్న ఆమెపై ఓ దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కదులుతున్న ట్రైన్ నుంచి ఆమె కిందకు దూకగా.. తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని.. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అత్యాచార ఘటనపై కీలక అప్డేట్ వ్చచింది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.


ఎంఎంటీఎస్ ట్రెయిన్‌లో అత్యాచారయత్నం కేసును పోలీసులు ఛేదించారు. అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేష్ అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంన్న మహేష్.. గంజాయికి బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈనెల 23న ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కిన మహేష్ ఒంటరిగా ఉన్న అమ్మాయిపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకునే క్రమంలో ట్రైన్ నుంచి దూకి ఆమె తీవ్రంగా గాయపడింది. మహేష్‌ ఫోటోను ట్రీట్‌మెంట్ తీసుకుంటుంన్న అమ్మాయికి చూపించగా నిందితుడు అతడే అని గుర్తించింది. దీంతో పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.


కాగా, ఈ కేసుపై రైల్వే పోలీస్ ఎస్పీ చందన దీప్తి స్పందించారు. సోమవారం బాధితురాలని పరామర్శించిన ఎస్పీ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళల కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కిన దుండగుడు.. ఒంటరిగా ఉన్న బాధిత యువతి వద్దకు వచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆమెను తన గదికి రావాలని కోరగా.. ఒప్పుకుంటే వదిలేస్తాడేమో అని భావించి ఆమె సరే అన్నట్లు తెలిపారు. అప్పటికి వదిలేసినప్పటికీ.. తనను ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో రన్నింగ్ ట్రైన్ నుంచి దూకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందుతోందని ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపినట్లు ఎస్పీ చందన దీప్తి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com