ఇరాన్కు అమెరికా సైనిక దళాలను పంపే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో విదేశీ యుద్ధాల్లో జోక్యం చేసుకోబోమన్న తన వైఖరికి భిన్నంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం న్యూయార్క్ పోస్ట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూగత అధ్యక్షులందరూ భూతల దళాలను పంపం అని చెబుతారు. కానీ నేను అలా చెప్పను అని స్పష్టం చేశారు.అవసరమైతే ఇరాన్కు సైన్యాన్ని పంపే అవకాశం ఉందని, అయితే బహుశా ఆ అవసరం రాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ నాయకత్వాన్ని అంతమొందించేందుకు శనివారం ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ ఊహించిన దానికంటే చాలా వేగంగా సాగుతోందని, ఒక్క రోజులోనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా 49 మంది కీలక నేతలను మట్టుబెట్టామని ట్రంప్ తెలిపారు. తొలుత నాలుగు వారాల్లో ఆపరేషన్ పూర్తవుతుందని చెప్పిన ఆయన, ఇప్పుడు నాలుగైదు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని అన్నారు.ఈ ఆపరేషన్లో సోమవారం నాటికి నలుగురు అమెరికా సైనికులు మరణించినట్లు సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు, రాయిటర్స్-ఇప్సోస్ నిర్వహించిన పోల్లో కేవలం 27 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఇరాన్పై దాడిని సమర్థించారు. అయితే, ఈ పోల్స్ను తాను పట్టించుకోనని, సరైనదే చేస్తానని ట్రంప్ తేల్చిచెప్పారు. ప్రజలు జరుగుతున్న పరిణామాలతో సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa