ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శవాలదిబ్బగా మారిన మయన్మార్.. 2700 దాటిన మృతుల సంఖ్య

international |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 10:18 PM

మయన్మార్‌లో భూకంపం సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతో వస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది సైతం అక్కడే నరకం చూస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టినా.. ఇంకా కొంతమందికి సాయం అందడం లేదు. ముఖ్యంగా శిథిలాల కింద నుంచి ఘోరమైన దుర్వాసన వస్తుండగా.. మృతదేహాల కోసం గాలిస్తున్నారు. స్థానిక ప్రజలు సైతం మండుటెండలో కష్ట పడుతూ.. ఎవరైనా బతికి ఉన్నారేమోనని వెతుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


మార్చి 28వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం అందరికీ తెలిసిందే. 7.7 తీవ్రతతో క్షణాల వ్యవధిలోనే ఆరు సార్లు భూకంపం సంభవించగా అనేక భవనాలు, బిల్డింగులు కూలిపోయాయి. క్షణాల్లోనే అన్నీ నేలమట్టం కాగా.. అందులో ఉన్నవాళ్లు సైతం అవే శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతుండగా.. అనేక మంది మృతదేహాలు లభ్యం అవుతున్నాయి. అలాగే తీవ్ర గాయాలపాలైన వారని బయటకు తీసుకు వస్తున్నారు.


ఇప్పటికే భూకంపం వల్ల 2719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మయన్మార్ మిలిటరీ తెలిపింది. అలాగే 4521 మంది గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఇప్పటికీ 441 మంది ఆచూకీ లభ్యం కాలేదని.. వారి కోసం గాలిస్తున్నట్లు వివరించింది. ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, రెస్క్యూ బృందాలు తక్కువగా ఉండడంతో.. అనేక చోట్ల శిథిలాల కింద చిక్కుకున్న వారు అలాగే నరకం చూస్తున్నారు. మాండలే వీధుల్లో అయితే కొన్ని చోట్ల ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వారి మృతదేహాలు శిథిలాలే కింద చిక్కుకున్నాయి. ఫలితంగా విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానిక మీడియ సంస్థలు చెబుతున్నాయి.


ఇంకొన్ని చోట్ల అయితే సామాన్య ప్రజలు సైతం.. ఇతరులకు సాయం చేసేందుకు చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్నారు. చిన్నచిన్న పారలతో మండుటెండలో నరకం చూస్తున్నారట. కానీ తోటి వాళ్లను కాపాడుకోవాలని తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేకపోయినా.. సహాయక చర్యలు మాత్రం అపడం లేదు. ఇటీవలే నమాజ్ చేస్తుండగానే మసీదులు కూలి 700 మందికి పైగా ముస్లిం సోదరులు సజీవసమాధి కాగా.. ఓ ప్రీ స్కూల్ కూలి ఇద్దరు టీచర్లు సహా 50 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా ఐరాస ప్రకటించింది. ముఖ్యంగా వీరంతా ఐదేళ్ల లోపు వారే కావడం ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com