ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనుషుల్నే కాదు.. కుక్కల్నీ వదలకండి.. గాజా నగరంలో 50 శాతం ఆక్రమించిన ఇజ్రాయేల్

international |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 11:01 PM

గాజాను ఇజ్రాయేల్ సైనికులు ఎడారిగా మారుస్తున్నారా? పాలస్తీనియన్లకు అక్కడ నిలువ నీడ లేకుండా చేస్తున్నారా? వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నారా? నివాసానికి పనికి వచ్చే ప్రతి భవనాన్ని కూల్చి వేస్తున్నారా? వ్యవసాయ భూములను కూడా నాశనం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కొంతమంది ఇజ్రాయేల్ సైనికులు తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. పాలస్తీనియన్లు తిరిగి రాలేని విధంగా వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నామని సైనికులు అంటున్నారు. అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐదుగురు ఇజ్రాయేల్ సైనికులు ఈ విషయాలు వెల్లడించారు.


 ఇప్పటికే గాజాలోని దాదాపు 50 శాతం భూభాగాన్ని ఇజ్రాయేల్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతాన్ని మిలిటరీ బఫర్ జోన్‌గా మారుస్తోంది. హమాస్‌ నాశనం చేసిన తర్వాత గాజాలో భద్రతా నియంత్రణ తమదే అని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఇదివరకే ప్రకటించారు. కాగా, కూల్చివేతల్లో పాల్గొన్న ఒక సైనికుడు మాట్లాడుతూ.. ‘వారు ఇక్కడకు తిరిగి రావడానికి ఇంకా ఏమీ మిగల్లేదు.. ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరు’ అని అన్నాడు. ఆ నేల బంజరు భూమిగా మారిపోతోందని ఆయన చెప్పాడు.


వేలాది మంది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాన్ని ఇజ్రాయేల్ బఫర్ జోన్‌గా మార్చింది. ఈ జోన్‌లో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. నీటి వసతి సౌకర్యాలను, పంటలను, చెట్లను నాశనం చేయమని తమకు ఆదేశాలు వచ్చాయని ఆ ఐదుగురు ఇజ్రాయేల్ సైనికులు తెలిపారు. బఫర్ జోన్‌ను కిల్‌ జోన్‌గా మార్చామని మరో సైనికుడు వెల్లడించాడు ‘మాపై దాడిచేసి చంపడంతో మేం ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు వారిని చంపుతాం. కేవలం వారిని మాత్రమేకారు వారి భార్యలను, చిన్నారులు, పిల్లులు, కుక్కలను కూడా చంపుతున్నాం’ అని ఇంకో సైనికుడు అన్నాడు.


‘ఇజ్రాయేల్ సరిహద్దుల్లోని బఫర్ జోన్‌లోదాదాపు గాజా పౌరులు ఖాళీ చేసిన తర్వాత ప్రాథమికంగా ఇళ్లను లేదా శిథిలాల తొలగింపునకు సంబంధించిన మిషన్లను ప్రారంభించాం’ అని చెప్పాడు. ఇది మా దినచర్య అని వివరించాడు. ‘ప్రతి ప్లాటూన్‌కు ఐదు, ఆరు లేదా ఏడు ప్రదేశాలు, ఏడు ఇళ్లు కేటాయిస్తారు.. ఉదయం లేచినప్పటి నుంచి అక్కడే మేము పని చేయాలి. ధ్వంసం చేస్తున్న ప్రదేశాల గురించి లేదా ఎందుకు చేస్తున్నామో మాకు పెద్దగా తెలియదు. బహుశా ఇవి చట్టబద్ధమైనవి కావు అని నేను భావిస్తున్నాను’ అని ఆ సైనికుడు వివరించారు. అయితే, అక్కడ ఎవ్వరూ ఉండకూడదని భావిస్తోన్న ఇజ్రాాయేల్.. పూర్తిగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తోన్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa