వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (03.04.2025) కర్నూలులో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో వైయస్ఆర్సీపీ నాయకుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని అనంతరం తాడేపల్లి చేరుకుంటారు.
![]() |
![]() |