ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ విభజన కోసమే వక్ఫ్ బిల్లు ఆమోదం: సోనియా గాంధీ

national |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 02:41 PM

లోక్‌సభలో గురువారం వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బిల్లు ఆమోదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో శాశ్వతమైన విభజనను తీసుకొచ్చేందుకే బీజేపీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందని, అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకు సభలోకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని ఆగదంలోకి నెట్టుతున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇక, పార్లమెంటులో ప్రతిపక్షాలను మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని సోనియా ఆరోపించారు. కాంగ్రెస్‌ సభ్యులు తమ సమస్యలను లేవనెత్తనివ్వకుండా సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. భాజపా సభ్యులు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలని టార్గెట్‌ చేశాయన్నారు. వారి వైఫల్యాలను ఎత్తిచూపే విషయంలో పార్టీ ఎంపీలు అంతే దూకుడుగా వ్యవహరించాలని ఈసందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సహా పార్టీ ఎంపీలందరూ హాజరయ్యారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com