బ్రహ్మకుమారి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దాది రతన్ మోహిని (100) కన్నుమూశారు. అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించారు. 1925 మార్చి 25న జన్మించిన దాది రతన్ మోహిని 100 ఏళ్లు దాటిన రెండో బ్రహ్మకుమారిగా రికార్డు నెలకొల్పారు. తన సేవా కార్యక్రమాలతో దాది రతన్ అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సోమవారం ఆమె పరిస్థితి మరింత ఆందోళనకంగా మారింది. దీంతో క్రిటికల్ కండీషన్లో ఉన్న ఆమెను అహ్మదాబాద్లోని జైడస్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 1.20 నిమిషాలకు ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలిపారు. అబూ రోడ్డులో ఉన్న బ్రహ్మకుమారి ప్రధాన కార్యాలయంలో శాంతివనంకు ఆమె పార్ధీవదేహాన్ని తీసుకెళ్లనున్నారు.సింధ్లోని హైదరాబాద్లో 1925, మార్చి 25వ తేదీన దాది రతన్ మోహిని జన్మించారు. ఆమె ఒరిజినల్ పేరు లక్ష్మీ. చాలా ఉన్నతమైన కుటుంబంలో ఆమె జన్మించారు. హైదరాబాద్, కరాచీ నుంచి ఆమె అంతర్జాతీయ స్థాయిలో బ్రహ్మకుమారి ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1954లో జపాన్లో జరిగిన వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్లో బ్రహ్మకుమారీల తరపున ఆమె పాల్గొన్నారు. హాంగ్కాంగ్, సింగపూర్, మలేషియాతో పాటు ఆసియా దేశాల్లోనూ ఆమె పర్యటించారు.
![]() |
![]() |