ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ పని నుండి తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటోలో అప్పటికే ఇద్దరు పురుషులు ఉన్నారు.
దీంతో డ్రైవర్ సహా ఇద్దరు పురుషులు ఆమెపై కన్నేసి ఇంటికి బదులు ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు. సదరు మహిళ చేతులను దుప్పటితో కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కత్తితో పొడిచి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |