ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరిక్రొత్త రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 11:18 AM

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ప్లాన్‌లను అందిస్తోంది. ప్రధానంగా రెండో సిమ్‌గా ఉపయోగించుకునే వారికి తక్కువ ధరతో వార్షిక రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటోంది. కేవలం రూ.127 నెలవారీ ఖర్చుతో ఏడాది పాటు అపరిమిత కాలింగ్, డేటా లభిస్తున్న ఈ అద్భుత ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.గత కొద్ది రోజులుగా ప్రైవేటు టెలికాం సంస్థలు తమ రీఛార్జి ప్లాన్లను పెంచినప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ లక్షలాది మంది కస్టమర్లకు సరసమైన టెలికాం కంపెనీగా మారింది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌లను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం రెండు అద్భుతమైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.ఇందులో ఒకటి.. ఏడాదికి (365 రోజులు) ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,515లకు అందిస్తోంది. ఈ ప్లాన్‌లో వినియోగదారుడు ప్రతి రోజు 2 జీబీ హై స్పీడ్ డేటాను పొందడంతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం, రోజుకు వంద ఎస్ఎంఎస్‌‌లను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లేదు. కానీ ఈ ప్లాన్ వల్ల నెలవారీ ఖర్చు కేవలం రూ.126.25 మాత్రమే అవుతుంది.మరో ప్లాన్ విషయానికి వస్తే 336 రోజుల కాలానికి రూ.1,499 రీఛార్జి ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో 24 జీబీ డేటా మాత్రమే అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్లాన్‌తో నెల వారీ ఖర్చు రూ.137లు మాత్రమే అవుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com