సింహాచలం ఘటనపై బుధవారం ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై విచారణకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందజేయాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ కమిటీలో పురపాలక ముఖ్యకార్యదర్శి సురేేశ్ కుమార్, ఈగల్ చీఫ్ రవికృష్ణ, ఇరిగేషన్ అధికారి వెంకటేశ్వరరావు ఉన్నారు.
![]() |
![]() |