ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వాతంత్య్రం ప్రకటించుకున్న బలూచిస్థాన్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

international |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 08:24 PM

పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారత్ దాయాదిపై ఆపరేషన్ సిందూర్ చేపట్టగా.. పాక్ సైతం ప్రతిదాడులు చేసింది. చివరకు గెలవలేక పాక్ కాళ్లబేరానికి వస్తే కాల్పుల విరమణకు అంగీకరించింది. కానీ దౌత్యపరంగా ఒత్తిడిని కొనసాగిస్తూనే వస్తోంది. ఇలాంటి సమయంలోనే పాక్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బలూచిస్థాన్ రచయిత మీర్ యార్ బలూచ్.. బలూచిస్థాన్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్ అనే పదం ఆన్‌లైన్‌లో తెగ ప్రాచుర్యం పొందుతోంది.


భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల సమయంలోనే బలూచిస్థాన్ తమ సొంత దేశమైన పాక్‌పైనే తిరగబడింది. తమకు స్వాతంత్రం కల్పించాలని కోరుతూ.. పాక్ ఆర్మీయే లక్ష్యంగా దాడులు చేసింది. భారత్ నుంచి విడిపోయిన పాక్.. తమను బలవంతగా ఆ దేశంలో కలుపుకుందని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా బీఎల్ఏ మరికొన్ని వేర్పాటువాద గ్రూపులతో కలిసి.. ప్రత్యేక దేశంగా ఏర్పడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. తమకు సాయం చేయమంటూ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని సైతం అడిగారు. ఆయుధాలు ఇస్తే.. తామే పాక్‌పై దాడి చేసి నామరూపాల్లేకుండా చేస్తామని వివరించారు.


ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా బలూచిస్థాన్ రచయిత మీర్ యార్ బలూచ్.. బలూచిస్థాన్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్ అనే పదం ఆన్‌లైన్‌లో తెగ ప్రాచుర్యం పొందుతోంది. ఇది మాత్రమే కాకుండా తమ ప్రత్యేక దేశాన్ని భారత్ గుర్తించాలని.. న్యూఢిల్లీలో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే సార్వభౌమత్వాన్ని సమర్థించి, శాంతి పరరక్షణ కోసం మద్దతు ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితిని అడిగారు. ఇందుకోసం శాంతి బలగాలను బలూచిస్థాన్‌లో మోహరింప జేయాలని డిమాండ్ చేశారు.


ఇది మాత్రమే కాకుండా జాతీయ పాస్‌పోర్టులు, కరెన్సీ ముద్రణ కోసం ఆర్థిక సాయం చేయాలని భారత దేశాన్ని కోరారు. అంతర్జాతీయ వేదికగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్‌ను అధికారికంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సైన్యం, సరిహద్దు దళాలు, పోలీసులు, సైనికులు సైనిక నిఘా, ఐఎస్ఐ మరియు పౌర పరిపానలోని బలూచ్ కాని సిబ్బంది అంతా వెంటనే బలూచిస్థాన్‌ను విడిచి వెళ్లిపోవాలని అన్నారు. అలాగే అతి త్వరలోనే స్వతంత్ర్య బలూచిస్థాన్ కొత్త ప్రభుత్వానికి అప్పగించబడుతుందని.. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే మంత్రి వర్గంలో బలూచ్ మహిళలకు ప్రాతినిథ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.


బలూచిస్థాన్ స్వాతంత్ర్య వేడుక కూడా త్వరలోనే జరుగుతుందని.. మిత్ర దేశాల అధినేతలు తమ దేశానికి వచ్చి జాతీయ కవాతును వీక్షించాలని, ఆశీర్వదించాలని కోరారు. కానీ వీటిపై ఇప్పటి వరకు ఏ ఒక్క దేశమూ స్పందించలేదు. అలాగే పాకిస్థాన్ కూడా అధికారికంగా దీన్ని ధ్రువీకరించలేదు. కానీ నెట్టింట మాత్రం ఈ పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com